అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుడు
– త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనివాసుడు అని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి అన్నారు. గురువారం ఉదయం అయ్యన్నపేటలో శ్రీక్షేత్రమ్లో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్యవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవాలయంలో పంచమ వార్షికోత్సవ బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరగుతున్నాయని అన్నారు.ప్రతీ ఒక్కరూ స్థిరచిత్తంతో దేవుని ప్రార్ధించాలని, భక్తిప్రపత్తులు కలిగి ఉండాలని అన్నారు. మనకు ఏది మంచిదో భగవంతుడు దానినే ఇస్తాడని, దేవుని పట్ల అంకితభావం కలిగి ఉండడం భక్తుల విధి అని అన్నారు. దేవాలయం ధర్మకర్తలు దుర్గాబాలాజీ, ఉమాదేవి దంపతులు మాట్లాడుతూ 26వ తేదీన సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం, 27వ తేదీ ఉదయం పంచవింశతి కలశ స్నపనమ్, మార్చి 1వ తేదీన అష్టోత్తర కలశాభిషేకం, 2వ తేదీన ఉత్సవాంత స్నపనమ్ ఉంటాయని భక్తులందరూ పాల్గొనాలని కోరారు.