అగమ్యగోచారంలో డిప్యుటీ షన్ పంచాయతి కార్యదర్శులు
అనకాపల్లి జిల్లా :
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పంచాయతి రాజ్ శాఖలో వివిధ హోదాలో డిప్టేషన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు పనిచేస్తున్న చోట బయోమెట్రిక్ హాజరు పడక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హజరు తప్పనిసరి అని పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ఉత్తర్వులు తో ఉద్యోగులు భయాందోళనలకు గురి అవుతున్నారు. జిల్లాలో సుమారుగా 25 మంది పైబడి పంచాయతి కార్యదర్శులు డిప్యుటీ షన్ మీద విధులను నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు బయోమెట్రిక్ హాజరు వెసెందుకు ప్రయత్నం చెసిన హజరు పడటం లేదు సుమారుగా 25 మంది గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 వరకు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా పంచాయతి రాజ్ కమీషనర్ ఆదేశాలు ఈ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నాయి.బయోమెట్రిక్ మిషన్ లో డిప్యుటీ షన్ ఉద్యోగులకు బయోమెట్రిక్ హజర్ ఆఫ్సన్ లేకపోవడంతో ఉద్యోగుల హజరు పడటం లేదు ఉద్యోగుల జీతాలు బయోమెట్రిక్ హజరు బట్టి జీతాలు చెల్లింపు ఉంటుందని కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే సుమారు 25 మంది డిప్యుటీ షన్ తో పనిచేస్తుంటే రాష్ట్రంలో ఉన్న మిగిలిన 25 జిల్లాలో డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచారంగా ఉందని పలు ఉద్యోగ సంఘాలు ఆవేదనను వ్యకం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఉద్యోగుల డిప్యుటీ షన్ రాజకీయ ఒత్తిడి కారణంగానే జరిగినట్లు తెలుస్తుంది.ఉద్యోగులు డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చుకుని జీతాలు తీసుకునే పరిస్థితి నెలకొంది అని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిప్యుటీ షన్ ని రద్దు చెయ్యమని ఉన్నతాధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే
సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగులు ఆవేదనను వ్యకం చేస్తున్నారు. బయోమెట్రిక్ హజరు కల్పిస్తేనే పనిచెయ్యగలమని లేకుంటే డిప్యుటీ షన్ రద్దు చెయ్యాలని ఉద్యోగులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏవిదంగా స్పందిస్తారో వేచి చూడాలి.