రెవెన్యూ సదస్సు లో పాల్గొన్న రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యల నుంచి రైతులను విముక్తులును చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆలోచన మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, అవినీతికి తావు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని,
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ప్రభుత్వ కార్యాలయ ల చుట్టూ తిరగకుండా, మీ సమస్యలు పరిష్కరించుకోవాలని సురేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ కుమార్, ఆర్ ఐ రమేష్, కూటమి పార్టీ నాయకులు పూడి పరదేశి నాయుడు, చెక్కల శ్రీను, సైనిక్, నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *