వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఈరోజు మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజవర్గం చెందిన ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులని అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సత్కరించి గౌరవించి అభినందనలు తెలియజేశారు. ఈ విద్యార్థులు నవోదయ ఫలితాలలో విద్యార్థులు డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు 9 ర్యాంకు మొదలైన ర్యాంకులతో సీట్లు కైవసం చేసుకున్నారు. తుంపాల గ్రామానికి చెందిన మల్ల ధనుంజయ్ అనే విద్యార్థి వంద మార్కులు గాను 98.75 మార్కులతో ఉమ్మడి విశాఖపట్నం డిస్టిక్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు. ఎల్లపు కుసాల్ అనే విద్యార్థి ఆల్ ఇండియా సైనిక్ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు మరియు జాతీయ 116 వ ర్యాంకు సాధించిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంతటి ఘనవిజయం సాధించిన సైనిక్,నవోదయ ఆర్ ఎం ఎస్ విద్యార్థులను హెచ్ వి ఎన్ అకాడమీ నుంచి ఎంపికపోవడం కావడం విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

