(వీ డ్రీమ్స్ విజయవాడ)
కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు మరి పది రోజులు పొడిగించారు. ముందు నిర్ణయించిన గడువు జూలై 14 తో ముగుస్తుంది. అయితే ఉరుకులు పరుగులు తీసినా నమోదు అనుకున్నంత వేగంగా జరగలేదు. దీంతో గత్యంతరం లేక మరి పది రోజులు అంటే ఈనెల 24 వరకుపొడిగించారు.
24న పోలింగ్ స్టేషన్ల రేషన్లైజేషన్
31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
తుది జాబితా అక్టోబర్ 31న విడుదలవుతుంది.
గడువు పొడిగింపు వల్ల ఇప్పటివరకు నమోదు కాని ఓటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా నమోదు పత్రాల సేకరణ కు బి ఎల్ ఓ లకు అవకాశం లభిస్తుంది

