[వి డ్రీమ్స్ ప్రత్యేకం]
జగన్ జమానా లో జరిగిన భూముల రీ సర్వే తప్పుల తడకగా తయారవడం తో సి ఏం చంద్రబాబు నాయకత్వం లోని రాష్ట్ర ప్రభత్వం రీ- సర్వే నిర్వహణలో మార్పులు తెచ్చింది. గ్రామంలో సర్వే అంతా వి ఆర్ వో సర్వేయరు లు ఇద్దరే నిర్వహిస్తే మంచి ఫలితాలు రావని రెవెన్యూ గ్రామాలను బ్లాకులుగా విభజించి సర్వే ను ప్రారంభించారు. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి చేస్తున్న సర్వే మొదటి దశ త్వరలో పూర్తి కానున్నది
అయితే పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న ఈ సర్వే లోకూడా అనేక తప్పులు దొర్లుతున్నాయి కొలతలు సరిగా లేవని, రికార్డులన్నీ తప్పులు తడక లని రైతులు గొడవ చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులలో తప్పులను రికార్డుల స్వచ్చీకరణ లో సరి చేయనందునసర్వేలో సమస్యలు ఎదు రవుతున్నయని సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రీ-సర్వే జరిగిన తర్వాత గాని తెలియరాలేదు అదెంత లోపభూయిష్టం గా ఉందో! 2 లక్షల మందికి పైగా రైతులు రీ సర్వే సదస్సుల్లో అర్జీలు ఇచ్చారు. వాటిని చక్క దిద్ధకుండనే సరిచేసామని ప్రభుత్వంలెక్కలు చెబుతున్నది. ఒక పక్క పైలెట్ గ్రామాల రీ-సర్వే , మరోపక్క పాత రీ సర్వే తప్పులను సరి చేయమని ప్రభుత్వం ఆదేశించింది.అనకాపల్లి జిల్లా ఆ అర్జీల పై విచారణ కు నోచుకోలేదు. అర్జీలు తహశీల్దార్ కార్యాలయాల్లో మూలుగుతున్నా యి. మరోపక్క ఆ తప్పుల తడక ఫైనల్ ఆర్ వో ఆర్ లు, ఎల్ పి ఎం. లు రైతుల మద్య కలతలు రేపుతున్నాయి.
తగు జాగ్రత్తలు తీసుకోవా లి . లేదంటేపైలెట్ రీ- సర్వేకు ఇదే గతిపడుతుంది. రికార్డుల స్వచ్చీకరణ జరపకుండానే రీ సర్వేలో దిగారు. రికార్డులు పొలం వాస్త వ పరిస్థితులు చూడాల్సందే .గ్రౌండ్ ట్రూతింగ్ కేవలం రికార్డుల చూడడానికి పరిమితమయింది. గత ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వేలో రికార్డులు చూడకుండానే భూమ్మీద ఎవరు ప్రత్యక్షమైతే వారి పేరునమోదు చేసి LPM లు చేతిలో పెట్టారు. ఇలాంటి తప్పులను వీడ్రీమ్స్ ఉన్నతాధికారుల ముందు ఉంచితే ఫైనల్ ఆర్ వో ఆర్ ఆమోదానికి వెళ్ళే చివరి క్షణంలో సవరించి, సర్వేయర్ ను తీవ్రంగా మందలించారు. ఆ సర్వేయర్ కొందరు రైతుల నుంచి డబ్బు తీసుకుని విస్తీర్ణాలను అడ్డగోలుగా పెంచేశాడు. ఇందుకోసం చిన్న రైతుల విస్తీర్ణాలు తగ్గించాడు. అలాగే బంజర్లు లో కొంత భూమి పక్క రైతుల అకౌంట్ లో వేశాడు. రీ సర్వే అర్జీల విచారణ జరిగితే ఇలాంటివన్నీ బయటపడతాయి.
రికార్డులను సరిచేసుకోవడంతో పాటు సర్వేలో తేలిన విస్తీర్ణం సర్వే అధికారులను వివరణ కోరి నిర్ధారించుకోవాలి. 9(2) నోటీసులు అందుకొని తేడాలు ఉంటే లిఖిత పూర్వకంగా రీ సర్వే తహశీల్దార్లకు పిర్యాదు చేయాలి. అపీళ్లను విచారించేందుకు మొబైలు టీంలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
క్షేత్ర స్థాయి పర్యవేక్షణ
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనది రీ సర్వే .ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను తహశీల్దార్ నుంచి ఆర్డీవోడిప్యూటీ కలెక్టర్లు , జె సి , కలెక్టర్లు క్షేత్ర పర్యటనలు జరిపి లబ్దిదారులతో నేరుగా మాట్లాడి కార్యక్రమం అమలును పరిశీలిస్తారు. అయితే రీ సర్వేలో ఉన్నతాధకారుల క్షేత్ర పర్యవేక్షణ సున్నా. భూపాలన శాఖ ,రెవెన్యూ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లాల్లోని ఉన్నతాధికారుల కు బాద్యతలను గుర్తు చేస్తే సర్వే మెరుగు పడుతుంది. ఇలాంటి పర్యవే క్షణ లేకనే ఇనాం రైత్వారీ భూములను , రైత్వారీ భూములను గత సర్వేలో ఇనాం భూముల కేటగిరీలు చేర్చారు. దాంతో మేం పడుతున్న పాట్లు పగవాడికైనా రాకూడదని రైతులు వాపోతున్నారు. ఇనాం భూములుగా నమోదయితే రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసు కొనాలే తప్ప తహశీల్దార్లు ఏమి చేయలేరు. సి ఏం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ప్రైవేటు భూములను 22(A) నుంచి తొలగించమని ఇచ్చిన ఆదేశా లు అనకాపల్లి తో సహ చాలా జిల్లాల్లోకి అమల్లోకి రాలేదు.
చోడవరం ప్రస్తుత ఎమ్మెల్యే రాజు వంటి ఒకరిద్దరు మినహా అనకాపల్లి జిల్లాలో మిగతా ఎమ్మెల్యే లు ఎవరు ప్రతిష్టాత్మకమైన రీ సర్వే పై దృష్టి పెట్టలేదు.
చాలా గ్రామాల్లో సరైన ఎఫ్.ఎం.బి.లు,ఎస్.ఎఫ్.ఏలు లభ్యం కావడం లేదని ఫారాలు ముద్రించేందుకు,ఇతర ఖర్చులకు ఇస్తున్న 15 వేల రూపాయలు చాలడం లేదని మరో పక్క తగిన సమయం ఇవ్వడం లేదని సర్వే బృందాలు వాపోతున్నాయి.


