డిసిసిబి చైర్మన్ గా కోట్ని బాలాజీ

వీ డ్రీమ్స్ అనకాపల్లి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి, పృధ్వీ, ప్రదీప్, టీడీపీ బుచ్చయ్యపేట మండలం యాదవ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి రమేష్ మర్యాదపూర్వకంగా కోట్ని బాలాజీ ని కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసి సాలువతో సత్కరించి చిత్రపటాన్ని బహుకరించారు. 2013లో తెలుగు నాడు విద్యార్థి సంఘం (టీఎన్ఎస్ఎఫ్) కోట్ని బాలాజీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. పార్టీకి బాలాజీ అందించిన సేవలకుగాను ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *