వీ డ్రీమ్స్ అనకాపల్లి
దేవరపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో శివారు గ్రామాలైన కోక్కలు బంద జారురాయి కొత్తవలస పి వి టి జి కొందు తెగకు చెందినవారు. గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి. టి. దొర మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు స్వతంత్రయం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నప్పటికీ వాళ్ల జీవితంలో వెలుగు రాలేదు. ఆ గ్రామాలకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరారు. మదనగరువు పేదవాడవా కోక్కలు బంద జారురాయి కొత్తవలస వంతవన్నపాలెం కొండపైనపి వి టి టి జి కొందు తెగకు చెందిన గిరిజనులకు మంచినీరు లేక ఓటగడ్డే శరణ్యంగా జీవం సాగిస్తున్నారు. మలేరియా డెంగ్యూ కలరా వంటి వ్యాధులు బారిన పడుతున్నారు. ఆ గిరిజన గ్రామాలకు వెంటనే వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి జల్జీవన్ మిషన్లో ఇంటింటి కొళాయి ఏర్పాటు చేయాలని కోరారు. మదనగరువు జారురాయి కొత్తవలస కోక్కలు బందా వంతువన్నపాలెం కొండపైన మొదలగు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అడ్డాకుల టోపీలు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం స్పందన కార్యక్రమం లో కలెక్టర్ విజయ్ కృష్ణన్ కి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బోయిన రాము పాంగి రామన్న పాంగి నరసింహారావు పాంగి గంగులు కిల్లో శివరాజు కిల్లో తులసి పాంగి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
